byసూర్య | Fri, May 31, 2024, 03:14 PM
నల్లగొండ జిల్లాలోని పత్తి ఇతర పంటల విత్తనాలకు ఇలాంటి కొరతలేదని రైతులకు కావలసిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. గురువారం ఏడిఏ, ఎంఏఓ, ఏఈఓ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.