byసూర్య | Fri, May 31, 2024, 03:16 PM
భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని కాశవాడ సమీపంలో శివరాత్రి మల్లయ్య (45) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మల్లయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.