byసూర్య | Fri, May 31, 2024, 03:09 PM
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం పోలేపల్లి రాంనగర్ గ్రామ శివారులో సాగర్ హైదారాబాద్ రోడ్డు పక్కన సుమారు వయస్సు 45 నుండి 50 ఏళ్ల వయస్సు వ్యక్తి గత నెల రోజుల నుండి బిక్షాటన చేస్తూ అనారోగ్యంతో మృతి చెందాడని, మృతుడి కుడి చేతికి ఆరు వేళ్ళు ఉన్నట్టు, మృతుడుని గుర్తిస్తే 8712670230 నంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.