byసూర్య | Fri, May 31, 2024, 12:18 PM
నాణ్యత ప్రమాణాలతో కూడిన విత్తనాలను మాత్రమే తయారు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం వాజేడు మండల కేంద్రంలోని టీఎస్ఎస్డీసీ ప్రాసెసింగ్ యూనిటును కలెక్టర్ సందర్శించి విత్తనం తయారీ చేసే విధానాన్ని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన విత్తనాలు మాత్రమే తయారు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని విత్తనాలు సకాలంలో అందేలా చూడాలన్నారు.