byసూర్య | Wed, May 29, 2024, 06:43 PM
కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న పలువురు వ్యాపారులకు మున్సిపల్ అధికారులు భారీగా జరిమానాలు విధించారు. మున్సిపల్ సానిటరీ అధికారులు గతంలో దాడులు నిర్వహించారు. వ్యాపారులకు నోటీసులు అందించిన మళ్లీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించడంతో జరిమానాలు వేసినట్లు సానిటరీ ఎస్సై రవీందర్ తెలిపారు. బాలాజీ రాందేవ్ స్వీట్ హోమ్ యజమానికి రూ. 20 వేలు జరిమానా విధించారు.