byసూర్య | Wed, May 29, 2024, 07:04 PM
దోమకొండ మండల కేంద్రానికి చెందిన రావులపల్లి విష్ణువర్ధన్ రెడ్డి (25) అనే యువకుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు దోమకొండ ఎస్సై గణేష్ తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, నరేందర్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రతిరోజు డబ్బులు అడుగుతూ తండ్రితో గొడవకు దిగేవాడని, డబ్బులు ఇవ్వకపోతే చనిపోతనంటూ బెదిరించేవాడని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగగా డబ్బులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.