byసూర్య | Wed, May 29, 2024, 06:40 PM
సమాచార హక్కు చట్టంపై స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమని కామారెడ్డి డైయిరీ టెక్నాలజీ కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్ ఉమాపతి అన్నారు. సహచట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డైయిరీ టెక్నాలజీ కళాశాలలో సోమవారం ప్రారంభమైన శిక్షణ తరగతులు మంగళవారం ముగిశాయి. ఉమాపతి మాట్లాడుతూ అవగాహన పర్యవేక్షణ లేక సహచట్టం నేటికి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం, లింగం, తదితరులున్నారు.