byసూర్య | Tue, May 28, 2024, 07:34 PM
నాగిరెడ్డి పేట్ మండలం గోపాల్ పేట్ టౌన్ సాయి నగర్ కాలనిలో నాలుగు రోజులుగా నీటి సమస్యతో కాలని వాసులు ఇబ్బంది పడుతున్నారని, మహిళలు మంగళవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు మీడియా ద్వారా విషయం తెలుసుకుని, వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్యెల్యే అదేశంతో 4రోజుల్లో సరఫరా కానీ నీరు 3గంటల్లో నీటిసరఫరా మొదలైంది.