byసూర్య | Tue, May 28, 2024, 07:21 PM
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి ట్రాక్టర్, ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు తగిలాయి. ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. కొట్టాల్ గ్రామానికి చెందిన మహిళలు గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అక్కడ ఉన్న యువకులు చీకట్లో సహాయక చర్యలు చేపట్టారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.