byసూర్య | Tue, May 28, 2024, 07:20 PM
నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్ పేట్ జీపీలోని కాలనీవాసులకు నాల్గు రోజులుగా మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు విఫలం అయ్యారంటూ, ఆవేదన వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో మంగళవారం మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యతో అల్లాడుతుంటే పట్టించుకునే వారు లేరన్నారు. దాదాపు అరగంటకు పైగా ప్రధాన రహదారిపై మహిళలు రాస్తారోకో తో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు స్పందించి తాగునీటినీ సరఫరా చేయాలంటున్నారు.