byసూర్య | Tue, May 28, 2024, 07:15 PM
కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం ద్వారా రైతులకు 833 బస్తాల జీలుగు, 282 బస్తాల జనుము విత్తనాలను విక్రయించామని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద జనుము 40 కిలోల బస్తాను రూ. 1448, జీలుగా 30 కిలోల బస్తాను రూ. 1116 లకు విక్రయిస్తున్నామన్నారు. రైతులకు సరిపడా విత్తనాలను తెప్పిస్తున్నట్లు, రైతులు సంయమనం పాటించాలని కోరారు.