byసూర్య | Tue, May 28, 2024, 07:12 PM
జీలుగ, పెద్ద జనుము విత్తనాలను సోమవారం నుంచి పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లాలోని గాంధీ గంజ్ కు చేరుకున్నారు. గంజిలోని వ్యవసాయ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 9 గంటలకు కార్యాలయం తెరిచే సమయానికి వందలాదిమంది క్యూలో ఉన్నారు. అధికారులు రైతుల వివరాలను పరిశీలిస్తూ సాయంత్రం వరకు విత్తనాలను పంపిణీ చేశారు. క్యూలో గంటల తరబడి ఉండాల్సి రావడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.