byసూర్య | Tue, May 28, 2024, 07:11 PM
నల్లమల ప్రాంతంలో ఎన్నో వనరులు ఉన్నాయని, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వయిజరీ కమిటి మెంబర్ బొజ్జ అమరేందర్రెడ్డి కోరారు. మంగళవారం హైద్రాబాద్లో టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్రెడ్డిని కలిశారు. నల్లమల ప్రాంత పరిస్థితులను వివరించారు. సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో నల్లమలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని కోరారు.