byసూర్య | Tue, May 28, 2024, 06:28 PM
నల్గొండ జిల్లా డిండి మండలం కొత్తతండాకు చెందిన ఎఫ్ డబ్ల్యూఓ ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ బహుజన సాహితి అకాడమీ సేవ రత్న జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. బహుజన సాహితి అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్, బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా సోమవారం హైదారాబాద్ లో అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందుకున్నారు. కాగా జూన్ 10న పూనేలో కిషన్ నాయక్ అవార్డు అందుకోనున్నారు.