byసూర్య | Tue, May 28, 2024, 03:14 PM
బేగంపేట్ లోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో ప్రజాభవన్ పేలి పోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ అగంతకుడు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. ఫోన్ చేసిన వ్యక్తికి సంభందించిన వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రజాభవాన్ హై అలెర్ట్ కొనసాగుతోంది.