byసూర్య | Tue, May 28, 2024, 02:41 PM
దుబ్బాక మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. జీలుగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా రైతులు క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.