byసూర్య | Sun, May 26, 2024, 10:47 AM
టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ తొలిసారి శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.