byసూర్య | Sun, May 26, 2024, 11:25 AM
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో స్వామివారి దర్శనార్థం గంటల తరబడి క్యూ లైన్ లో వేచి చూశారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు.