byసూర్య | Sat, May 18, 2024, 10:51 AM
పోలీసులు కొట్టడంతో మనస్థాపంచెంది ఆటోడైవర్ చెట్టుకి ఉరేసుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలో చోటుచేసుకుంది. నర్మాల వెంకటయ్య(43) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్యాసింజర్లు ఆటోలో బంగారం పడిందని డ్రైవర్ మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంకటయ్యను పిలిచి ఎంక్వైరీ పేరుతో కొట్టారని కుటుంబసభ్యులు ఆరోపించారు. మనస్థాపానికి గురై ఉరేసుకొని మృతి చెందినట్లు తెలిపారు.