byసూర్య | Sat, May 18, 2024, 10:59 AM
హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్అరుణశ్రీ, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.