byసూర్య | Sat, May 04, 2024, 02:50 PM
మహబూబ్ నగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో "ట్రాన్స్ జెండర్లకు" శనివారం ఓటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి సిబ్బంది నాగరాజు, మాసూం బాబా, సాధిక్, 40 మందికి పైగా ట్రాన్స్ జెండర్లు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.