byసూర్య | Wed, May 01, 2024, 01:49 PM
బిజేపీ తీసుకు వచ్చిన నాలుగు కార్మిక కోళ్ల రద్దు కోసం పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కార్యదర్శి టి. శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుదవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆ సంఘ జిల్లా కార్యాలయంలో మేడే ను పురస్కరించుకొని జెండా ఆవిష్కరించిన అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లు గా కుదించి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు.