హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి,,,,ప్రతి గంటకు బస్సు

byసూర్య | Thu, Apr 25, 2024, 07:30 PM

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్‌ఈఎల్ (BHEL) నుంచి రూ.564 టికెట్ ధరగా నిర్ణయించారు. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ బస్సులను ప్రత్యేకంగా సంస్థ తయారు చేయించింది. వేసవిలో చల్లదనం అందించే ఈ బస్సులను వినియోగించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలంది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.


హైదరాబాద్ -బెంగళూరు మార్గంలో ప్రయాణించే వారికి కూడా టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయణంపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని.. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM