'తెలంగాణలో లేడీ కేఏ‌ పాల్'.. మాధవీలత చేష్టలపై నెటిజన్ల ట్రోలింగ్

byసూర్య | Thu, Apr 25, 2024, 07:18 PM

 ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనంద్ పాల్‌ అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకప్పుడు క్రైస్తవ మత ప్రచారకుడిగా, మానవతావాదిగా.. ప్రపంచ దేశాలు తిరుగుతూ అగ్రరాజ్యాల అధ్యక్షులకు సైతం ఆశీర్వాదం ఇచ్చే స్థాయిలో ఉండే కేఏ పాల్.. నేడు తెలుగు రాజకీయాల్లోకి వచ్చి తన చేష్టలతో నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు. ఆ మధ్య ఎన్నికల్లో ఆయనకు హెలికాప్టర్‌ గుర్తు కేటాయించగా.. ప్రచారం సమయంలో చేతిలో హెలికాప్టర్ బొమ్మ పట్టుకుని.. వింత వింత చేష్టలు చేస్తూ ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ.. అవి మీడియాలో, సోషల్ మీడియాకు ట్రోలింగ్ స్టఫ్‌‌గా మారాయి. దీంతో.. కేఏ పాల్ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. నెటిజన్‌లో వైరల్ అవుతున్నాయి. దీంతో.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన ఓ కమెడియన్‌గా మారిపోయారు. కాగా.. ఇప్పుడు కేఏ పాల్ పూర్తిగా ఏపీ పాలిటిక్స్‌కు వెళ్లిపోగా.. తెలంగాణలో లేడీ కేఏ పాల్ వచ్చిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.


ఆ లేడీ కేఏ పాల్ అంటూ ట్రోలింగ్ చేస్తుంది ఎవరినో కాదండి.. హైదరాబాద్ లోక్ సభ స్థానం బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత . దానికి కారణం.. ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రవర్తిస్తున్న తీరు.. కొన్ని చేష్టలేనంటున్నారు జనాలు. సంఘ్ సభ్యురాలిగా ఉన్న మాధవీలతను.. ఓటమి ఎరుగని ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి బీజేపీ అధిష్ఠానం దింపటంతో.. అందరి దృష్టి ఆకర్షించారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పాతబస్తీలోనూ.. ఎంఐఎంకు ధీటుగా ప్రచారం నిర్వహిస్తూ బీజేపీని జనాల్లోకి తీసుకెళ్తున్నారు మాధవీలత. ఇంటింటి ప్రచారంతో పాటు.. రోడ్ షోలు, మీడియాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈసారి హైదరాబాద్‌లో కాషాయ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఈ క్రమంలోనే.. మాధవీలత చేస్తున్న కొన్ని చేష్టలు వివాదాస్పదంగా మారటమే కాకుండా నెటిజన్ల చేతిలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఇటీవల.. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా పాతబస్తీలో ఓ మసీదుకు విల్లు ఎక్కుపెట్టినట్టుగా చేసిన యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దానిపై ఫిర్యాదులు చేయటంతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పతంగి ఎగరేస్తున్నట్టు.. దాన్ని మధ్యలో కట్ చేసినట్టుగా ఆమె చేసిన యాక్షన్ చేశారు. ఈ యాక్షన్ చేసినప్పుడు.. ఓ బీజేపీ నేత ప్రసంగిస్తున్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఉండటం గమనార్హం. కాగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.


తెలంగాణకు లేడీ కేఏ పాల్.. మాధవీలత అని, కేఏ పాల్‌కు ఫీమేల్ వర్షన్ అని.. గత ఎన్నికల్లో ఆయన కూడా ఇలాగే సేమ్ టూ సేమ్ చేశాడంటూ నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. కేవలం కేఏ పాలే కాదు.. ఆమెలో మరో నిత్యానంద కూడా కనిపిస్తున్నారని.. ఆయన కూడా ఇలాంటి కామెడీలే చేసేవాడంటూ కామెంట్ల రూపంలో ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తుందని ఒకరు ప్రశ్నిస్తే.. తర్వాత బీజేపీ ప్రెసిడెంట్ ఆమెనే అని మరోకరు జోస్యం చెప్తున్నారు. ఇంకొకరు.. మాధవీలత చేస్తున్న ఎంటర్‌టైన్మెంట్‌ను అందరూ ఎంజాయ్ చేస్తున్నారని.. ఆమెకు అర్జెంటుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM