byసూర్య | Wed, Apr 24, 2024, 01:41 PM
కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి గ్రామపంచాయతీ ఉంద్రీగాం గ్రామంలో పిచ్చి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఇంటి ఆవరణలో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో సాయి తేజ బాలుడిపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బాలున్ని ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అధికారులు పిచ్చి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.