ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్

byసూర్య | Sun, May 05, 2024, 08:59 PM

వెచ్చగా అమ్మ పొత్తిళ్లలో బజ్జోవాల్సిన నవజాత ఆడ శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణంతో ఉండగానే మట్టిలో పూడ్చేశారు. అటుగా వెళ్తోన్న ఓ ట్యాంకర్ డ్రైవర్ మట్టిలో ఏదో కదులుతున్న ఆనవాళ్లు గుర్తించి తవ్విచూశాడు. పసిగడ్డు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. స్థానిక ఉపాధి కూలీల సాయంతో ఆసుపత్రికి తరలించి పసికందుకు పునర్జన్మను ప్రసాదించాడు. గుండెలు పిండేసే ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయరహదారి పక్కన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ - భూపాలపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్యాంకర్‌ డ్రైవర్‌ రాందినయ్‌ జాతీయరహదారి పక్కనే ఉన్న నీటి తొట్టి నుంచి శనివారం నీటిని రోడ్డు విస్తరణ పనులకు తీసుకువెళ్తున్నాడు. నీటితో ట్యాంకర్‌ను నింపుతున్న క్రమంలో రహదారి పక్కనే మట్టిలో ఓ శిశువు కాళ్లు, చేతులు కదులుతూ కనిపించింది. మట్టిని తొలగించి చూడగా ఓ ఆడశిశువు కనిపిచింది. కొన ఊపిరితో పాప కొట్టుమిట్టాడుతోంది. లారీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. అక్కడే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలను పిలిచి శిశువును కాపాడారు.


విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు రాగా.. వారి వాహనంలోనే దామెర క్రాస్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఆడ శిశువు కావడంతో తల్లిదండ్రులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM