పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్

byసూర్య | Sun, May 05, 2024, 10:26 PM

హిందూ సంస్థ కీలక నేత హత్య కుట్ర చేసిన ముస్లిం మతపెద్దను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై మతవిద్వేషాలను రెచ్చగొట్టడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీస్ అదికారులు వెల్లడించారు. నిందితుడు మౌల్వీ అబుకర్ తైమూల్ మదర్సాలో బోధిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యిందని తెలిపారు. పాకిస్థాన్‌‌కు చెందిన డోంగర్, నేపాల్‌కు చెందిన షెహనాజ్ అనే వ్యక్తులతో గత రెండేళ్లుగా కాంటాక్ట్‌లో ఉన్నాడని అన్నారు. భారతదేశంలోని హిందూ సంస్థలు ప్రవక్తను కించపరుస్తున్నాయని పాక్, నేపాల్‌కు చెందిన నిందితులు నిందితులు మౌల్వీని ప్రేరేపించారని చెప్పారు.


సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సంస్థ నేత ఉపదేశ్ రానా హత్యకు నేపాల్, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులతో కలిసి కుట్రచేసిన నిందితుడు.. వారి నుంచి రూ.కోటి సుపారీ, ఆయుధాలను సేకరించేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. ‘ఓ వ్యక్తి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న సూరత్ క్రైమ్ బ్రాంచ్.. అతడిపై నిఘా ఉంచింది.. శనివారం అనుమానితుడ్ని సూరత్ చౌక్ బజార్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అతడి మొబైల్ ఫోన్ పరిశీలించగా.. పాకిస్థాన్, నేపాల్ వ్యక్తులతో చాటింగ్ చేసినట్టు గుర్తించాం.. హిందూ సంస్థ నాయకుడే అతడి మొదటి టార్గెట్’ అని సీపీ వెల్లడించారు.


అలాగే, నిందితుడికి పాక్, నేపాల్‌కు చెందిన వ్యక్తులు లావోస్‌లో సిమ్ కార్డు కూడా అందజేశారని తెలిపారు. ‘సోషల్ మీడియాలో నిందితుడు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నాడు.. జాతీయ జెండా ఫోటోలను పెట్టి హిందూ మతంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.. తప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డును సృష్టించాడు.. విదేశీ వ్యక్తుల నుంచి ఆయుధాలను ఆర్డర్ చేశాడు.. పాకిస్థాన్, వియత్నాం, ఇండోనేషియా, కజకస్థాన్, లావోస్ సహా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులతో వాట్సాప్‌లో కోడ్‌లతో చాటింగ్ చేస్తున్నాడు’ అని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.


సుదర్శన్ టెలివిజన్ ఛానల్ చీఫ్ ఎడిటర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మలను పాకిస్థాన్, నేపాల్‌కు చెందిన వ్యక్తులతో బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పారు. సనాతన సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రానా హత్యకు కుట్ర చేశాడని ఆరోపించారు. ఆయనకు 15 సార్లు ఫోన్లు చేసి.. 2019లో లక్నోలో హత్యకు గురైన యూపీ హిందూ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కమలేశ్ తివారీ మాదిరిగా హత్యచేస్తామని బెదిరించాడు. రానాను హత్య చేస్తే రూ.కోటి ఇస్తామని పాక్, నేపాల్ నిందితులు ఆశపెట్టినట్టు తెలిపారు. తైమూల్ స్వస్థలం మహారాష్ట్రలోని నందుర్బర్‌గా గుర్తించారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM