byసూర్య | Wed, Apr 24, 2024, 01:41 PM
బొల్లారంలోని ట్రాన్స్కో ఉద్యోగి ఇంట్లో ACB అధికారులు సోదాలు చేపట్టారు. రూ.34లక్షలు, 20తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ శాఖలో AEగా పని చేస్తున్న అనిల్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో దాడులు నిర్వహించారు. అనిల్ రెడ్డి నివాసంలో కోటి రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. అతడి బంధువుల ఇండ్లలో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో రూ.12 వేలు లంచం తీసుకుంటూ అనిల్ పట్టుబడ్డాడు.