byసూర్య | Wed, Apr 24, 2024, 01:37 PM
విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎవరైనా గంజాయి రవాణా చేసినా అక్రమంగా అమ్మకాలు సాగించినా నిర్భయంగా పోలీసులు దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, వన్ టౌన్ ఎస్ హెచ్ వో ఎన్. దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.