byసూర్య | Wed, Apr 24, 2024, 01:34 PM
భీమిని మండలం అక్కలపల్లి గ్రామానికి చెందిన చాపిడి శ్యాంబాబుపై అదే గ్రామా నికి చెందిన చాపిడి విజయ్ కుమార్, కమల, రాజ్ కుమార్ 2020లో గొడ్డలి తో దాడిచేసి గాయపర్చారు. బాధితుడి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కొమురయ్య కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జిల్లా కోర్టుజరిమానా విధించినట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.