పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు

byసూర్య | Sun, May 05, 2024, 08:54 PM

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పబ్ అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు. పబ్‌లో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత 'ఆప్టర్ నైన్' పబ్‌ కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్‌కు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. అశ్లీలంగా డ్యాన్సులు చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు.


ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు పబ్‌పై కేసు నమోదు చేశారు. దాడి చేసిన సమయంలో పబ్‌లో మెుత్తం 160 మంది యువతీ యువకులు ఉండగా.. వారందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరందరికీ 41A సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపుతున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. పబ్‌లో నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఆరోపణలు రాగా.. ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు.


Latest News
 

హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM
తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, May 18, 2024, 08:52 PM
యాదాద్రి కొండపై ఇక నుంచి ప్లాస్టిక్ నిషేదం,,,ఉత్తర్వులు జారీ చేసిన ఈవో Sat, May 18, 2024, 08:50 PM