byసూర్య | Wed, Apr 24, 2024, 01:18 PM
పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామ ప్రధాన రహదారి గుంతలు పడి పూర్తిగా చెడిపోయింది. ఈ సమస్యను పుట్నూర్ గ్రామానికి చెందిన వైద్య నరేష్ అనే వ్యక్తి ఫోటోలు తీసి మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సమస్య పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన కలెక్టర్ బుధవారం అధికారులను కుర్మపల్లి గ్రామానికి పంపించి ట్రాక్టర్ తో రోడ్డును చదును చేయించి గుంతలు పూడ్చివేయించారు.