byసూర్య | Mon, May 06, 2024, 10:42 AM
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కొరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి ఆద్వర్యంలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామి కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థిని చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు