byసూర్య | Mon, May 06, 2024, 11:35 AM
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఎమ్మెల్యే నివాసంలో మండల ఇంచార్జి మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గుoజల్ పాడ్ మాజీ ఎంపీటీసీ కెకె కృష్ణ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే కృష్ణకు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.