byసూర్య | Mon, May 06, 2024, 11:36 AM
మోడీ కోసం దేశమే ఎదురుచూస్తుందని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐలాపురం తండాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. మోడీ చేసిన అభివృద్దే మళ్లీ ప్రభుత్వం రావడానికి కృషి చేస్తుందన్నారు. యువతకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి మోడీ అని తెలిపారు. రానున్న రోజుల్లో మోడీ పాలనలో ఇంకా అభివృద్ధిని చేసుకుంటామని తెలిపారు.