byసూర్య | Wed, Apr 24, 2024, 01:16 PM
జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ యోగానంద లక్ష్మి నరసింహస్వామి వారి జాతర మహోత్సవంలో బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదాలు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.