byసూర్య | Wed, Apr 24, 2024, 01:06 PM
విద్యుత్తు షాక్తో గేదె మృతి చెందిన ఘటన ముగ్పాల్ మండలం మంచిప్ప గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రైతు కేతావత్ శ్రీనివాస్కు చెందిన పాడి గేదె మేత కోసం వెళ్లి విద్యుత్తు షాక్తో అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.1.5 లక్షల విలువ చేసే తన గేదె మృతిచెందిందని, నష్ట పరిహారం చెల్లించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.