byసూర్య | Wed, Apr 24, 2024, 01:04 PM
కామారెడ్డి జిల్లాలో మంగళవారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలో బజరంగ్దళ్, విహెచ్పి ల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించారు. కోడూరి హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా సాగింది. శోభయాత్రలో సీతా, శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వేషధారణతో చిన్నారులు అలరించారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.