byసూర్య | Wed, Apr 24, 2024, 12:53 PM
మాగనూర్ మండలం గురురావ్ లింగంపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఆంజనేయ స్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి రథాన్ని లాగారు. రథోత్సవానికి గ్రామస్థులతో పాటు కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు.