byసూర్య | Wed, Apr 24, 2024, 12:49 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 17 మంది జిహెచ్ఎం లు తప్పుడు సమాచారంతో 'స్పౌజ్' పాయింటర్లు ఉపయోగించుకుని అనుకులమైన పాఠశాలలను ఎంచుకున్నారు. వారిలో 9 మంది జిహెచ్ఎం లకు ఆర్జెడి నోటీసులు పంపగా, ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోకుండా వారితో కుమ్మక్కయ్యారని మంగళవారం విద్యా సంఘాల నాయకులు కమీషనర్ & డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఫిర్యాదు చేశారు. ఆర్జేడీ విజయలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.