వాటికి కూడా పరిహారం,,,,మంత్రి తుమ్మల కీలక అప్డేట్

byసూర్య | Mon, Apr 22, 2024, 09:01 PM

గత మార్చి నెలలో తెలంగాణలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, మెుక్కజొన్నతో పాటు మామిడి, నిమ్మ, బత్తాయి వంటి ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావటంతో రైతన్నలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రతిపక్ష నేత, భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలు కూడా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.


తాజాగా.. మార్చిలో కురిసిన అకాల వర్షం కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అకాల వర్షాలు, వడగళ్లతో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు చెప్పారు. శనివారం రాత్రి వరకు 2,200 ఎకరాల నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేయగా.. రంగారెడ్డి, జనగామ, నిర్మల్‌ జిల్లాల్లో మరో 920 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. పంట నష్టం పరిహారంపై కీలక అప్డేట్ కూడా ఇచ్చారు.


ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. మార్చిలో కురిసిన వడగళ్ల వానలతో జరిగిన పంటనష్టాలకు పరిహారం విడుదల చేసేందుకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కోరామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా మరోమారు సంప్రదించి సత్వరమే నిధుల విడుదలకు అధికారుల నుంచి అనుమతి కోరతామన్నారు. తాజాగా.. రెండ్రోజుల క్రితం కూడా వర్షాలు కురిసి పంట నష్టం జరగ్గా.. ఆ నష్టాన్ని కూడా త్వరగా మదింపు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ నివేదిక కూడా రాగానే వారికి కూడా నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించారు. ఇక వానాకాలం సీజన్‌కు సరఫరా చేసే పచ్చిరొట్ట విత్తనాల సేకరణ కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని తెలిపారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM