byసూర్య | Mon, Apr 22, 2024, 03:49 PM
హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లత పై సోమవారం హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీరామనవమి శోభయాత్రలో మజీద్ పై బాణం ఎక్కుపెట్టిన విషయంపై షేక్ ఇమ్రాన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. సిద్ధంబర్ బజార్ చౌరస్తా వద్ద ఉన్న మజీద్ పై మాధవి లత బాణం ఎక్కుపెట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులు పేర్కొన్నారు.