తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం : బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు

byసూర్య | Fri, Sep 20, 2024, 03:17 PM

తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన చెప్పారు.టెండరింగ్ ప్రక్రియే తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణ చేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని శుక్రవారం విడుదల చేశారు. లడ్డూ తయారీలో నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే విషయం భయంకరమైందిగా చెప్పారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు.


 


 


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM