స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా పరిశీలన

byసూర్య | Fri, Sep 20, 2024, 03:13 PM

ఈరోజు కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల కమిటీ మార్గదర్శకాల ప్రకారం గ్రామ పంచాయతీ వార్డుల వారిగా ఓటర్ జాబితాలో తప్పొప్పులపై సవరణలకు సెప్టెంబర్ 21 వరకు అవకాశం ఇచ్చి అన్ని గ్రామాల్లో ఓటర్ జాబితా ముసాయిదా ప్రచురణ చేశాము.
వాటిపై అన్ని రాజకీయ పార్టీలు పరిశీలించుకోవాలని ఎంపిడిఓ కోరారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపిఓ ఎం. శోభ, సీనియర్ అసిస్టెంట్ మారుతీప్రసాద్, బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్ రెడ్డి, ఆవుల మహేందర్, కాంగ్రెస్ మండల ప్రధానకార్యదర్శి వేల్పుల వెంకటస్వామి, సీపీఐ మండల కార్యదర్శి ముంజ గోపి గౌడ్, బీఎస్పీ మండల అధ్యక్షుడు వేల్పుల మహేష్, ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల శ్రీనివాస్, బీఎస్పీ మండల ఉపాధ్యక్షుడు చిట్యాల అశోక్, కాంగ్రెస్ నాయకులు ముంజ తిరుపతి గౌడ్, ఇల్లందుల శ్రీనివాస్ గౌడ్, తో పాటుగా మండల పరిషత్ సిబ్బంది స్వామీ నాయక్, అనిల్, శరత్,  తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM