byసూర్య | Mon, Apr 22, 2024, 03:48 PM
త్యాగాలు చేయడం రాహుల్ గాంధీ బ్లడ్ లోనే ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెహ్రూ పరిపాలన నుంచి దేశంలో రామరాజ్యం ప్రారంభమైందని చెప్పారు. విద్య, పారిశ్రామిక రంగం నెహ్రు నుంచే అభివృద్ధి చెందిందని తెలిపారు. తాను లేవనెత్తిన అంశాలపై చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.