byసూర్య | Mon, Apr 22, 2024, 01:59 PM
బిజెపి పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతోందని ప్రధాని మోదీ నిరూపించారని పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం అయిజ మండలంలోని ఉత్తనూరు గ్రామంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. రోజూ వారి కూలి రూ. 301 ఇవ్వాలని కూలీల తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు అంజి తదితరులు పాల్గొన్నారు.