byసూర్య | Sun, Apr 21, 2024, 01:30 PM
41 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా సిద్దిపేట టాస్క్ఫోర్స్ మరియు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ ధర్మకాంట వద్ద బోలెరో వాహనం డ్రైవర్, యజమాని ప్రభుత్వ అనుమతి లేకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.