ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు

byసూర్య | Sat, Apr 20, 2024, 09:19 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూల్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సహా.. పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. నామినేషన్ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల, కేసుల వివరాలు వెల్లడించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తనపై 5 క్రిమినల్‌ కేసులున్నట్లు తెలిపారు.


 ఇక ఆస్తి విషయానికి వస్తే.. మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూ.1.41 కోట్లుగా వెల్లడించారు. సర్వీసులో ఉండగానే ఆయన వీఆర్ఎస్ తీసుకోగా.. ప్రభుత్వం నుంచి వచ్చే సర్వీసు పింఛను మాత్రమే తనకు ఆదాయ వనరు అని చెప్పారు. చరాస్తుల విలువ రూ.73.39 లక్షలు కాగా.. ఇందులో ఆయన కుమార్తె పేరిట చేసిన డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్ల విలువ రూ.21.18 లక్షలుగా పేర్కొన్నారు. తన వద్ద 5 తులాల బంగారం, తన సతీమణికి 15 తులాలు, కుమారుడికి 5 తులాలు, కుమార్తెకు 15 తులాల బంగారం ఉన్నట్లుగా వెల్లడించారు. ఎలాంటి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనాలు లేవని తెలిపారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో రూ.13.55 లక్షల విలువైన అసంపూర్తి ఇల్లు ఉందని.. మెుత్తంగా రూ.51.80 లక్షల అప్పులున్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.


పెరిగిన కొప్పుల ఈశ్వర్ ఆస్తులు


పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో వెల్లడించారు. తనకు రూ.5.22 కోట్ల విలువైన ఆస్తులున్నాయని.. 6 తులాల బంగారం, ఆయన సతీమణి వద్ద 20 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. మొత్తం చరాస్తుల విలువ రూ.3.59 కోట్లు కాగా.. ఇద్దరికీ కలిపి 20 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూములు, వాణిజ్య భవనం ఉన్నాయన్నారు. ఈ ఆస్తుల విలువ రూ.1.63 కోట్లుగా పేర్కొన్నారు. ఆస్తులతో పాటు అప్పులు రూ.2.3 కోట్లు ఉన్నాయిన్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రూ.5.03 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొనగా.. ప్రస్తుతం 19 లక్షలు అదనంగా చూపించారు.


అసదుద్దీన్‌కు వ్యవసాయ భూమిలేదు


ఇక హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి రూ.23.87 కోట్ల ఆస్తులున్నాయి. మెుత్తం ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.20.91 కోట్లు కాగా.. ఆయన కుటుంబం పేరిట వ్యవసాయ భూములేమీ లేవు. పిల్లల పేరిట స్థిర, చరాస్తులేమీ లేవు. పాతబస్తీ మిస్రీగంజ్‌, మైలార్‌దేవ్‌పల్లిల్లో ఇళ్లు ఉన్నాయి. అప్పులు రూ.7.05 కోట్లుగా వెల్లడించారు.


Latest News
 

తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM
హైదరాబాద్ ప్రచారంలో అరుదైన దృశ్యం.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు Fri, May 03, 2024, 11:41 PM
నిజమైన అభివృద్ధి అంటే ఇది.. మళ్లీ ఫోటోలు వదిలిన కోన వెంకట్ Fri, May 03, 2024, 10:48 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ Fri, May 03, 2024, 10:46 PM
కూలీగా మారిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య Fri, May 03, 2024, 10:40 PM