byసూర్య | Sat, Apr 20, 2024, 09:06 PM
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త రకం ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్లోని బోడబండ తండాలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన ప్రచారంలో భాగంగా.. ఓ మామిడి చెట్టెక్కి మరీ ప్రసంగించారు. ఓ మామిడి తోటలో చెట్టు కింద తండావాసులను సమావేశపర్చిన మంత్రి.. చెట్టెక్కి మైకులో ప్రసంగించారు. ఇందుకు సబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.