వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క

byసూర్య | Fri, Apr 19, 2024, 09:03 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో గేరు మార్చింది. ఇప్పటికే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని.. ఇక మిగిలినవి కూడా లోక్ సభ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని చెప్తున్నారు. కాగా.. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి.. ఏ ఒక్క హామీ అమలు చేయలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ దుమ్మెత్తిపోస్తోంది. అందుకు.. కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తూ.. అమలు చేయని హామీల గురించి ఓ క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. రైతు రుణమాఫీ అమలు గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.


వంద రోజుల్లో రైతులకు 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని తాము అనలేదని.. కానీ రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. త్వరలోనే రుణమాఫీ చేస్తామని వివరించారు. ముందుగా.. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటున్నామని పేర్కొన్నారు. మేడిగడ్డ కూలింది అంటే.. దాంట్లో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల సొమ్ము ఉందని.. ఆ విషయం ప్రజలకు తెలియకూడదా.. అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ప్రమాదకరమని.. ఆర్థిక ప్రయోజనాల కోసం పౌరుల జీవితల్లోకి చొరబడ్డారంటూ భట్టి మండిపడ్డారు.


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మందిని బ్లాక్ మెయిల్ చేశారని కీలక ఆరోపణలు చేశారు భట్టి. ఫోన్లు విని బ్లాక్ మెయిల్ చేయటమనేది తప్పు కాదా.. అని భట్టి ప్రశ్నించారు. పరిశ్రమలకు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఎవరికైనా సమస్య వస్తే.. తన దృష్టికి తీసుకురావాలని.. వెంటనే పరిష్కారించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. అలాంటి వారిపై కేసులు పెడతామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వాన్ని.. ఏడాది కూడా ఉండదని కేసీఆర్ ఏవేవో అంటున్నాడని.. తలకిందులుగా తప్పస్సు చేసినా కాంగ్రెస్ సర్కారుకు ఎలాంటి ఢోకా లేదన్నారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM